Tuesday, November 20, 2007

.....ఆహ్! ఇది కలా!

అది సాయంకాలం 6.00 గంటలసమయం అర్జంటుగా కాగజ్ నగర్ వెళ్ళమని మాబాసునుంచి ఫోను వచ్చింది. ఆలస్యం చెయ్యకుండా సికింద్రాబాదు ఉరుకులు పరుగులమీద వెళ్ళాను. అక్కడవున్న టిటిని అడిగాను ఏ రైలు ఎక్కాలి అని. 1వ నంబరు ఫ్లాటుఫారంమీద ట్రైను వుంది త్వరగా వెళ్ళు అన్నాడు. ఫ్ళాటఫ్హరంమీదకు వెళ్ళే సరికి ట్రైన్ కదులుతూ కనిపించింది. పరుగెత్తి దొరికిన డోర్ లో ఎక్కేసాను. బోగీ చాలా ఖాళీగావుంది. పైబెర్తుపై చోటుచేసుకొని పడుకున్నను. ఎంతసేపు నిద్రపొయానో తెలియదు టిటి.నంటూ నిద్రలేపి టికెట్టు అడిగాడు, చూపించాను. నావంక ఎగాదిగాచూసి ఇది ఎ.పి. ఎక్స్ ప్రెస్స్ వెళ్ళదు కాబట్టి దిగిపో అనిచెప్పాడు. కొద్దిసేపట్లో సిగ్నల్ ఇవ్వని కారణంగా ఒక స్టేషనుకుదూంరగా ఆగింది. అక్కడదింపేసాడు. తీరాచూస్తే అది విజయవాడ. మళ్ళీ వాళ్ళను వీళ్ళను అడిగి కదులుతున్న రైలు ఎక్కాను మళ్ళీ మంచి సీటు దొరికింది. అసలే రాత్రి కిటికీలోచి గాలి చల్లగా వీస్తూంటే నిద్రలోకి జారిపోయా. ఎదో స్టేషను వచ్చింది. ఒక అతను వచ్చి ఈ సీటు నాది లే అన్నాడు. ఇంతకీ ఇది ఏ స్టేషను అని అడిగా. గుంటూరు అని చెప్పాడు. గుంటూరు ఎందుకు వస్తుంది నే వెళ్ళే దారిలొ అని కదులుత్తున్న రైల్లోంచి దిగేసా. ఇంతలో మరో పాసింజరు రైలు వచ్చింది. చాలా ఖాలీగా వుంది రైలు. ఎక్కి కూర్చున్నా. ఏమైనా ప్రతీస్టేషను చుస్తుండాలి అనుకున్నా. కాని కునుపాట్లు. చాల శబ్దంతో పెట్టెలోకి ఎక్కుంతుంటే ఒకర్ని అడిగా ఇది ఏస్టేషను అని. బాపట్ల, రైలు తిరుపతి వెల్తుంది అన్నాడు. ఏమిచెయ్యాలో అర్థంకాలేదు. అక్కడ దిగాను, అవతల ఫ్లాట్ ఫారం మీద వెరేవైపుగా మరో రైలు కనిపించింది. ఫాట్ పారం దాటి అందులోకి ఎక్కాను. రైలు చాలా రద్దీగా వుంది. ఎక్కడా సీటు దొరకలేదు. డోరుదగ్గరే నిలబడ్డా. కొద్దిసేపటికి తెలవారటం మొదలయ్యింది. ఎక్కడున్నానా అని బయటకు చూస్తే గోదావరి బ్రిడ్జమీదనుంచి వెళుతుంది ట్రైన్. ఇంతలో గోదారి చూడాలని అందరూ గుమ్మం దగ్గరకు తోసుకు వచ్చారు. ఒక్కసారిగా తోసుకువచ్చేసరికి ట్రైనులోంచి బయటకు పడి పెద్దగా అరుచుకుంటూ గోదావరిలో పడ్డా.
ఏమయ్యిందండీ అంటూ నా ఆవిడ కుదిపి లేపింది.



.....ఆహ్! ఇది కలా!